ఆర్టీఐ యాక్ట్‌ కిందికి మదర్సాలు?

ఆర్టీఐ యాక్ట్‌ కిందికి మదర్సాలు?

మతపరమైన విద్యను అందించే మదర్సాలు, వైదిక పాఠశాలలు, గురుకులాలను ఆర్టీఐ యాక్ట్‌ కిందికు తేవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. బీజేపీ నేత, లాయర్‌ అశ్విని ఉపాధ్యాయ్‌ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ పిటీషన్‌లో అనేక అంశాలను ప్రస్తావించారు. వీటిలో మరో కీలకమైన అంశం ఏమిటంటే… మదర్సాలకు, మిషనరీ స్కూల్స్‌కు ఇపుడు ఇస్తున్న గుర్తింపు వంటిదే గురుకులాలకు, వైదిక పాఠశాలలకు ఇవ్వాలని పిటీషనర్‌ కోరారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.

Leave a Reply