ఇవాళ మధ్యాహ్నం మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. దీనిపై నవాబ్ మాలిక్ ఆఫీస్ స్పందించింది. ‘న డరేంగే… న ఝుకేంగే’ బి రేడి ఫర్ 204… అంటూ ట్వీట్ చేశారు. #WeStandWithNawabMalik ట్యాగ్లైన్తో ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికలు తాము సిద్ధమని,.. కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలకు భయపడేదే లేదని నవాబ్ మాలిక్ ఆఫీస్ ట్వీట్ చేసింది. తాము తలవొంచేదే లేదంటూ 2024 సార్వత్రిక ఎన్నికలకు తాము సిద్ధమని స్పష్టం చేసింది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబై వచ్చి… మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో భేటీ అయిన తరవాత రాబోయే సార్వత్రిక ఎన్నకల కోసం జాతీయ స్థాయిలో కూటమి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ना डरेंगे ना झुकेंगे!
Be ready for 2024!#WeStandWithNawabMalik
— Office of Nawab Malik (@OfficeofNM) February 23, 2022