ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లను వేసవి సెలవుల తరవాత విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఆయనతో పాటు జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన బెంచ్ ఎదుట ఈ పిటీషన్లు ఇవాళ విచారణకు వచ్చాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఇది అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ విచారించాల్సిన అంశమని, బెంచ్ మళ్ళీ ఏర్పాటు చేయాలని… వేసవి సెలవులు తరవాత ఈ కేసును లిస్ట్ చేస్తున్నట్లు జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. అంతకుముందు పిటీషన్లలో ఒక పిటీషనర్ తరఫున సీనియర్ లాయర్ శేఖర్ నఫాడే ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడమేగాక, డీలిమిలేటషన్ ప్రక్రియ రాష్ట్రంలో జరుగుతోందని, వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు.