ఈఏడాది హజ్ యాత్రకు భారత్ నుంచి 79237 మందికి సౌదీ అరేబియా అనుమతించింది. ప్రపంచం వ్యాప్తంగా అత్యధిక యాత్రికులను అనుమతించి టాప్ 3 దేశాల్లో భారత్ కూడా ఉంది. అత్యధికంగా 1,00,051 మంది ఇండోనేషియావాసులను సౌదీ అరేబియా అనుమతించింది. 81,132 మందితో పాకిస్తాన్ రెండో స్థానంలోఉంది. మూడోస్థానంలో భారత్ ఉండగా, బంగ్లాదేశ్ నుంచి 57,585 మంది ఈ ఏడాది హజ్ యాత్రలో పాల్గొంటున్నారు. నైజీరియా నుంచి 43,008 మంది, ఆఫ్ఘనిస్తాన్ 13,582 మందికి సౌదీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది హజ్యాత్రకు మొత్తం పది లక్షల మంది పాల్గొంటారు. 8.50 లక్షల మంది విదేశీయులు కాగా, 1.5 లక్షల మంది స్వదేశం నుంచి అనుమతించారు. కరోనా తరవాత భారీ సంఖ్యలో యాత్రికులను హజ్కు అనుమతించడం ఇదే మొదటిసారి.
The Hajj Quota 1443 Per Country pic.twitter.com/YxtmGN9IU1
— 𝗛𝗮𝗿𝗮𝗺𝗮𝗶𝗻 (@HaramainInfo) April 21, 2022