భారత్‌ నుంచి 79,237 మంది

భారత్‌ నుంచి 79,237 మంది

ఈఏడాది హజ్‌ యాత్రకు భారత్ నుంచి 79237 మందికి సౌదీ అరేబియా అనుమతించింది. ప్రపంచం వ్యాప్తంగా అత్యధిక యాత్రికులను అనుమతించి టాప్‌ 3 దేశాల్లో భారత్‌ కూడా ఉంది. అత్యధికంగా 1,00,051 మంది ఇండోనేషియావాసులను సౌదీ అరేబియా అనుమతించింది. 81,132 మందితో పాకిస్తాన్‌ రెండో స్థానంలోఉంది. మూడోస్థానంలో భారత్‌ ఉండగా, బంగ్లాదేశ్‌ నుంచి 57,585 మంది ఈ ఏడాది హజ్‌ యాత్రలో పాల్గొంటున్నారు. నైజీరియా నుంచి 43,008 మంది, ఆఫ్ఘనిస్తాన్‌ 13,582 మందికి సౌదీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది హజ్‌యాత్రకు మొత్తం పది లక్షల మంది పాల్గొంటారు. 8.50 లక్షల మంది విదేశీయులు కాగా, 1.5 లక్షల మంది స్వదేశం నుంచి అనుమతించారు. కరోనా తరవాత భారీ సంఖ్యలో యాత్రికులను హజ్‌కు అనుమతించడం ఇదే మొదటిసారి.

Related Articles

Leave a Reply