ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా అలీ?

ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా అలీ?

ప్రముఖ హాస్య నటుడు అలీని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో భేటీ అయిన తరవాత అలీ మీడియాతో మాట్లాడారు. తనకు జగన్‌ ఏదైనా పదవి ఇవ్వదలిస్తే… ఆయన చెబుతారని అన్నారు. రాజ్యసభ్యునిగా ఆయనను పంపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజ్యసభలో కన్నా రాష్ట్రంలోనే ఆయన సేవలు వినియోగించుకోవడం పార్టీకి మంచిదని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న జగన్‌తో అలీ భేటీ అయిన తరవాత వక్ఫ్‌ బోర్డులో సభ్యులను నియమించినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సిఉంది.
వక్ఫ్‌ బోర్డు సభ్యులు వీరే..
ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డులో ఎలెక్టడ్‌ మెంబర్‌గా ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ను నియమించారు. ఇక నామినేటెడ్‌ సభ్యులుగా ఖాదర్‌ బాషా, మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్, షబనం ఆఫ్రోజ్, షేక్ షరీన్ బేగం, అబ్దుల్ బషీరుద్దీన్‌లను నియమించారు.

Related Articles

Leave a Reply