మంగళూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎల్పీ లీడర్, మాజీ మంత్రి అయిన యూటీ ఖాదర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు కర్ణాటకలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంలో దీనిపై చర్చ జరుగుతోంది. హిజాబ్ అంశంపై అసెంబ్లీలో అధికార బీజేపీని నిలదీసిన ఖాదర్ ఇపుడు హిజాబ్కు మద్దతుగా మాట్లాడటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగుతోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. హిజాబ్ను నిషేధించిన తరవాత కూడా హిజాబ్ కోసం విద్యార్థుల డిమాండ్ చేయడాన్ని ఆయన విమర్శించారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తరవాత అందరూ పాటించాల్సిందేనని అన్నారు. ఒకవేళ ఇష్టం లేకపోతే పాకిస్తాన్కో సౌదీ అరేబియాకు వెళ్ళిపోండని ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు సమర్థించడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం డైలమాలో పడింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని అనడంలో తప్పు లేకున్నా… బీజేపీ నేతల మాదరి కాంగ్రెస్ నేతలు కూడా హిజాబ్ను కోరే ముస్లిములను పాకిస్తాన్, సౌదీకి వెళ్ళమనడం ఏమిటని ముస్లిం సామాజిక వర్గంలో చర్చ జరుగుతోంది. ఖాదర్ సొంత నియోజవర్గమైన మంగళూరు ప్రాంతంలో బీజేపీ చాలా బంలంగా ఉంది. తన నియోజవర్గంలో హిందూ ఓట్ల కోసమే ఆయన అలా మాట్లాడినట్లు కాంగ్రెస్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.