కర్ణాటక కాలేజీల్లో హిజాబ్ను నిషేధించడం కరెక్టేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రభుత్వానికి అధికారం ఉందని పేర్కొంది. యూనిఫామ్కు సంబంధించి విద్యా సంస్థలు జారీ చేసే ఉత్తర్వులను విద్యార్థులు అమలు చేయాల్సిందేనని బెంచ్ పేర్కొంది. హిజాబ్ను ధరించడం ఇస్లాం మత సంప్రదాయాల్లో తప్పనిసరికాదని పేర్కొంది. చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. దీంతో హిజాబ్తో స్కూల్కు హాజరు అయ్యేందుకు అనుమతించాలన్న ముస్లిం విద్యార్థుల పిటీషన్ను కోర్టు కొట్టివేసింది.